Oscar Awards | మలయాళ బ్లాక్బస్టర్ మూవీ 2018 ఆస్కార్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ఎంపికలో భాగంగా మనదేశం నుంచి మలయాళ చిత్రం ‘2018’ని ఎంపిక చేశారు. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ విభాగంలో ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన కమిటీ, దరఖాస్తు చేసుకున్న 22 చిత్రాలను వీక్షించి ‘2018’ సినిమాను ఎంపిక చేసింది.
అయితే ఈ సినిమా ఎంపిక అవ్వడం పట్ల ఈ చిత్రబృందం సూపర్ స్టార్ రజనీకాంత్ను కలుసుకుంది. రజనీకాంత్ ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో ఉన్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్ను కలుసుకున్న 2018 టీమ్ తలైవా ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.
#2018Movie team met superstar #Rajinikanth at Trivandrum and got blessings from Superstar as it got selected for Oscars🏆#Thalaivar170 shooting also currently ongoing at Trivandrum 🎬 pic.twitter.com/imnMxojVVF
— AmuthaBharathi (@CinemaWithAB) October 8, 2023
2018లో సంభవించిన వరదలు కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యాన్ని తీసుకొని దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ హృదయాలకు హత్తుకునేలా ఈ సినిమా తీశారు. టోవినో థామస్ కథానాయకుడు. ‘ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో’ అనే ఉపశీర్షికకి తగ్గట్టుగా ఇందులోని ప్రతి పాత్ర మనసులకు హత్తుకుపోతుంది. కేరళలో వందకోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందీ ఈ చిత్రం.
జైలర్తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంత పురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది.