కరోనాకి ముందు థియేటర్స్ దగ్గర ఎంత సందడి వాతావరణం ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతి శుక్రవారం కనీసం నాలుగైదు కొత్త సినిమాలు విడుదల అవుతుండడంతో సినీ ప్రేక్షకుల ఆనందానికి హద్దులు ఉండేవి కావు.కాని కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారాయి. థియేటర్స్ దగ్గర సందడి అనేదే లేకుండా పోయింది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టడంతో ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు.
సెకండ్ వేవ్లో థియేర్స్ మూత పడగా, జూలై 30 నుండి తిరిగి తెరుచుకున్నాయి. దీంతో చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్లో విడుదల చేస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జూలై 30న సత్యదేవ్ నటించిన తిమ్మరసు చిత్రం థియేటర్స్లో విడుదలై ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన సంగతి తెలిసిందే. తిమ్మరసు, ఇష్క్లతో కలిపి ఐదు సినిమాలు గత వారం థియేటర్స్లో విడుదలయ్యాయి.
ఇక ఆగష్టు ఫస్ట్ వీక్లో మొత్తం ఏడు సినిమాలు రిలీజ్ కాగా ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ వీకెండ్ ఏకంగా 10 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆగస్టు 13న సుందరి, బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, చైతన్యం, కనబడుట లేదు వంటి చిత్రాలతో పాటుగా తమిళ డబ్బింగ్ సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’, ఆంగ్ల అనువాద చిత్రం ‘ది కంజురింగ్’ సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు అగష్టు 14వ తేది మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన “పాగల్” మరియు ఆర్. నారాయణ మూర్తి ‘రైతన్న’ సినిమాలు సందడి చేయబోతున్నాయి.ఈ సినిమాలు సినీ లవర్స్కి మంచి వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తుంది.