Ananad Devarakonda | ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ సినిమాలోని ‘పిచ్చిగా నచ్చేశావే..’ అనే గీతాన్ని మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేశారు.
ఈ పాటకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించగా, సురేష్ బనిశెట్టి రచన చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “బేబీ’ సినిమాలో నన్ను చూసి చాలా మంది ఏడ్చారు. కానీ ఈ సినిమాలో మాత్రం నవ్వుకుంటారు. వినూత్నమైన కథ ఇది. క్రైమ్ కామెడీగా అనూహ్యమైన మలుపులతో సాగుతుంది’ అన్నారు. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాడి, సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: ఉదయ్శెట్టి.