Purushothamudu | యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే భలే ఉన్నాడే సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు. రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఈ పోస్టర్ మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఒక గ్రామం కోసం.. అందులో ఉన్న ప్రజల కోసం డబ్బున్న ఒక కుర్రాడు.. తన అంతస్తును, హోదాను పక్కనపెట్టి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో హాసిని సుధీర్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గోపీ సుందర్, రచన-దర్శకత్వం: రామ్ భీమన.