న్యూఢిల్లీ: గ్రాసరీ వస్తువుల డెలివరీ స్కీం పూర్తిగా నిలిపేయాలని ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో నిర్ణయించింది. సరుకుల పంపిణీకి తాము అనుసరిస్తున్న పాలసీ సత్ఫలితాలనివ్వడం లేదని పేర్కొంది. సకాలంలో కస్టమర్ల అవసరాలను తీర్చలేకపోతున్నామని, తక్కువ టైంలో సరుకులు సరఫరా చేస్తామన్న హామీని అమలు చేయలేకపోతున్నట్లు తెలిపింది. అందువల్లే గ్రాసరీ వస్తువుల డెలివరీ ఈ నెల 17 నుంచి పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించామన్నది.
రిటైల్ చైన్ నెట్వర్క్ గ్రోఫర్స్లో జోమాటో రూ.745 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సందర్భంగా పైలట్ ప్రాజెక్టుగా గ్రాసరీ వస్తువుల పంపిణీ చేపట్టింది. కానీ సత్ఫలితాలివ్వకపోవడంతో నిష్క్రమించడానికి సంసిద్ధమైంది.