న్యూఢిల్లీ, జనవరి 13: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ సలీల్ త్రిపాఠీ కుటుంబానికి ఆ సంస్థ అండగా నిలిచింది. త్రిపాఠీ భార్య సుచేతకు ఉద్యోగాన్ని కల్పిస్తామని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురువారం ప్రకటించారు. రూ.10 లక్షల బీమాతోపాటు సహచర ఉద్యోగుల నుంచి రూ.12 లక్షల విరాళం కూడా కుటుంబానికి అందుతున్నదని ట్విట్టర్ ద్వారా చెప్పారు. త్రిపాఠీ 10 ఏండ్ల కుమారుడి చదువుకూ సాయం చేస్తామన్నారు. కాగా, ఈ నెల 8వ తేదీ రాత్రి ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 38 ఏండ్ల సలీల్ త్రిపాఠీ చనిపోయాడు.