Zomato : పూర్తి శాకాహార పదార్ధాలను కోరుకునే వారి కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవలను లాంఛ్ చేసింది. జొమాటో వ్యవస్ధాపకులు, సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో ఈ మేరకు ప్రకటించారు.
ప్రపంచంలోనే భారత్లో అత్యధిక శాతం శాకాహారులున్నారని, వారు తమ ఆహారం ఎలా కుక్ అవుతుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపై జాగరూకతతో ఉంటారనే ఫీడ్బ్యాక్ తమకు అందిందని గోయల్ పేర్కొన్నారు. దేశంలో శాకాహారుల నుంచి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తాము ఈ సర్వీస్ను లాంఛ్ చేశామని గోయల్ వెల్లడించారు.
ప్యూర్ వెజ్ మోడ్లో ప్రస్తావించే రెస్టారెంట్లు కేవలం వెజిటేరియన్ ఫుడ్ను మాత్రమే వండి, సర్వ్ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. నాన్-వెజ్ ఆహారాలను సర్వ్ చేసే రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉండవని ఎక్స్ పోస్ట్లో గోయల్ స్పష్టం చేశారు.అయితే నూతన సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కస్టమర్ల ప్రత్యేక అవసరాల కోసం భవిష్యత్లో ఇలాంటి ఫ్లీట్స్ మరిన్ని తీసుకువచ్చే ప్రణాళికలున్నాయని చెప్పారు.
Read More :
Uttar Pradesh | వంట త్వరగా చేయలేదని.. భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకుండు