న్యూఢిల్లీ, జూలై 14: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ప్రారంభమైన మొదటిరోజునే పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. బుధవారం బిడ్డిం గ్ ముగిసే సమయానికి 1.05 రెట్లు బిడ్స్ వచ్చాయి. కంపెనీ 71.92 కోట్ల ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, ఇన్వెస్టర్ల నుంచి 75.60 కోట్ల షేర్లకు బిడ్స్ పొందింది. ఈ ఐపీవో పట్ల రిటైల్ ఇన్వెస్టర్లకున్న ఆకర్షణను ప్రతిబింబిస్తూ రిటైల్ విభాగం 2.69 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. సంస్థాగత విభాగంలో 98 శాతం సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. ఆఫర్ జూలై 16న ముగుస్తుంది. ఆఫర్ ద్వారా కంపెనీ రూ.9,375 కోట్లు సమీకరిం చనున్నది.