న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ జోమాటో ఐపీవో ఆఫర్లు అదరగొట్టాయి. మూడు రోజుల పాటు సాగిన ఐపీవోలో చివరి రోజు శుక్రవారం 38.25 రెట్ల సబ్స్క్రిప్షన్లు జరిగాయి. రూ.9375 కోట్ల పెట్టుబడుల సేకరణ లక్ష్యంతో జొమాటో ఐపీవోకు వెళ్లింది. బుధవారం నుంచి ఈ ఐపీవో ఆఫర్లు కొనసాగాయి. జొమాటో 71.92 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 2,751.25 ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి.
వీటిలో రిటైల్ ఇన్వెస్టర్లు 7.45 రెట్లు సబ్స్క్రిప్షన్ల బిడ్లు దాఖలు చేశారు. నాన్ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 32.96 రెట్లు బిడ్లు వచ్చాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన నివేదికల్లో జొమాటో తెలిపింది. ఇక ఉద్యోగుల సబ్స్క్రిప్షన్ 62 శాతం పక్కన బెట్టగా, క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ బయ్యర్స్ 51.79 రెట్లు సబ్స్క్రైబ్ చేశారు.
జొమాటో తన షేర్ మార్కెట్ ఆఫరింగ్ ధర రూ.72-76గా నిర్ణయించింది. ఈ నెల 27న ఇటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రెష్ ఇష్యూ ద్వారా రూ.9000 కోట్లు, ప్రమోటర్ ఆధ్వర్యంలో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.375 కోట్ల నిధులు సేకరించనున్నది.