SBI Alert | మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయా.. మీ వేతనం లభించే బ్యాంకుతోనే మీరు లావాదేవీలు జరుపుతున్నారా.. మిగతా ఖాతాల్లో నగదు లావాదేవీలు జరపడం లేదా.. అయితే `నో యువర్ కస్టమర్ (కేవైసీ)`నిబంధన ప్రకారం అలా లావాదేవీలు జరుపని వారి ఖాతాలను బ్యాంకులు స్తంభింపజేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. పలువురు ఖాతాదారుల ఖాతాలను స్తంభింప జేసింది.
దీనిపై ఎస్బీఐ ఖాతాదారులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ ట్విట్టర్ హ్యాండిట్ను ట్యాగ్ చేశారు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రతి ఖాతాదారు నిర్దిష్ట గడువులోగా తమ కేవైసీ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అని ఓ కస్టమర్కు ఇచ్చిన సమాధానంలో ఎస్బీఐ తెలిపింది. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కస్టమర్లకు ఎస్సెమ్మెస్ల ద్వారా నోటిఫకేషన్లు పంపుతున్నట్లు వెల్లడించింది.
ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఖాతాదారులు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంకు ఖాతాతోపాటు రిజిస్టర్ చేసుకున్న ఈ-మెయిల్ ద్వారా కేవైసీ పత్రాల పత్రులను మెయిల్ చేయాలని సూచించింది. ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సంప్రదించి ఖాతాలో లావాదేవీలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని మరో కస్టమర్కు ఇచ్చిన సమాధానంలో వివరించింది.
ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకులో తమ కేవైసీ సమాచారాన్ని ఈ-మెయిల్ లేదా మెయిలింగ్ ద్వారా అడ్రస్, గుర్తింపు పత్రాల ప్రతులు సమర్పించాలి. ఆన్లైన్లో పంపాలని భావిస్తే అందుకు అవసరమైన పత్రాలను బ్యాంకు ఖాతాతో రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్కు తప్పనిసరిగా గుర్తింపు, చిరునామా సమాచార పత్రాలు పంపాలి. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం కేవైసీ అప్డేటింగ్కు అవసరమైన పత్రాలు ఏవంటే..!
పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, జాతీయ ఉపాధి హామీ పథకం కార్డ్, పాన్ కార్డు, తాత్కాలిక, శాశ్వత చిరునామా తెలిపే పత్రాలు
పదేండ్ల లోపు బాలల పేరిట ఖాతా నడుపుతున్నట్లయితే, ఆ ఖాతాలు నడుపుతున్న వారి పత్రాలు సమర్పించాలి. మైనర్ బాలలే నిర్వహిస్తున్నట్లయితే, వారి వ్యక్తిగత వివరాల పత్రాలు సబ్మిట్ చేయాలి.
పాస్పోర్ట్, రెసిడెన్స్ వీసా (విదేశాంగశాఖ ధృవీకృత పత్రం), నోటరీ పబ్లిక్, బ్యాంకు లావాదేవీలు పర్యవేక్షించే భారత ఎంబసీ అధికారుల సంతకాలు గల పత్రం సమర్పించాల్సి ఉంటుంది.