Nitin Gadkari | మీరు కొత్త కారు కొంటున్నారా..? అయితే, దానిపై కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నాయి. అయితే దానికో నిబంధన ప్రతిపాదించారు. పాత వెహికల్ స్క్రాపింగ్ తీసేసినట్లు వాల్యూడ్ సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు.. కార్ల తయారీ సంస్థలు కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ అసోసియేషన్స్ (సియామ్) సీఈఓ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు.
పాత వాహనాల స్క్రాపింగ్ కోసం దేశవ్యాప్తంగా 1000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్ నెస్ టెస్ట్ సెంటర్లు అవసరం అని గతేడాది నితిన్ గడ్కరీ చెప్పారు. నేషనల్ వెహికల్ స్క్రాపేజీ పాలసీ వల్ల అన్ని వాటాదారులకు లబ్ధి చేకూరుతుందని, సౌత్ ఆసియాలోనే భారత్ స్క్రాపింగ్ హబ్’గా మారుతుందన్నారు. 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ.. ‘నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ’ని ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేందుకు దశల వారీగా అన్ ఫిట్ వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీ దోహద పడుతుందన్నారు ప్రధాని మోదీ.
📍𝑩𝒉𝒂𝒓𝒂𝒕 𝑴𝒂𝒏𝒅𝒂𝒑𝒂𝒎, 𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊
Chaired a highly productive session of the SIAM CEO’s Delegation Meeting at Bharat Mandapam today, where we addressed various critical issues facing the automobile industry.
I am pleased to report that, in response to my… pic.twitter.com/9n4aUdgoby
— Nitin Gadkari (@nitin_gadkari) August 27, 2024
ఈ పాలసీ కింద పాత వాహనాలను స్క్రాప్ కింద తొలగించి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్ లో 25 శాతం వరకూ కేంద్రం రాయితీ ప్రకటించింది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ వెహికల్ స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వచ్చింది. 2021-22 బడ్జెట్లో వ్యక్తిగత వాహనాలకు 20 ఏండ్ల తర్వాత ఫిట్ నెస్ టెస్ట్, వాణిజ్య వాహనాలకు 15 ఏండ్ల తర్వాత ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించాలని వాహన పాలసీ ప్రతిపాదించారు.