ముంబై, ఏప్రిల్ 22: యెస్ బ్యాంక్ లాభాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తాకింది. నికర లాభం 45 శాతం తగ్గి రూ.202 కోట్లకు పడిపోయింది.
నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి రూ.2,105 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 2.8 శాతంగా నమోదైంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.618 కోట్ల నిధులను కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.