Yamaha | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘యమహా (Yamaha)’ మంగళవారం భారత్ మార్కెట్లోకి తన 2023 మాన్స్టర్ ఎనర్జీ మోటో జీపీ ఎడిషన్ (2023 Yamaha Monster Energy Moto GP Edition) మోటారు సైకిళ్లు ఆవిష్కరించింది. త్వరలో మోటోజీపీ 2023 టోర్నీ జరుగనున్న ఆర్15 ఎం, ఎంటీ-15 వీ2.0 మోటారు సైకిళ్లు, రే జడ్ఆర్ 125 ఫఐ హైబ్రీడ్ స్కూటర్ ఆవిష్కరించింది.
అయితే, పరిమిత సంఖ్యలోనే మాన్ స్టర్ ఎనర్జీ జీపీ తీసుకొస్తున్నది. ఈ నెల మూడో వారంలో యమహా బ్లూ స్క్వేర్ ఔట్లెట్లలో లభిస్తాయి. మ్యాక్సీ స్పోర్ట్స్ స్కూటర్, ఏరాక్స్ 155 బైక్ కూడా స్పెషల్ మోటో జీపీ ఎడిషన్గా ఆవిష్కరించింది.
వైజడ్ఎఫ్-ఆర్15ఎం – రూ.1,97,200
ఎంటీ-15 వీ2.0 – రూ.1,72,700
రే జడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ స్కూటర్ – రూ.92,330