చెన్నై, ఫిబ్రవరి 10: ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.
ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.1.39 లక్షలుగా నిర్ణయించింది. 149 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సింగిల్-చానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లతో రూపొందించింది సంస్థ.