న్యూఢిల్లీ, నవంబర్ 8: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్, 125 ఎఫ్1 హైబ్రిడ్ స్కూటర్లపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మిగత వాహనాలకు కూడా వర్తింపచేసింది.
150 సీసీ ఎఫ్జెడ్-ఎక్స్ మాడల్పై రూ.5 వేలు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, ఎఫ్జెడ్ఎస్-వీ3 ఎఫ్1, ఎఫ్జెడ్ఎస్-వీ4 ఎఫ్ఐపై రూ.3 వేల ఇన్స్టంట్ క్యా ష్బ్యాక్, 125 సీసీ స్కూటర్ ఫ్యాసి జో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మాడల్పై రూ.3 వేల ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ను అందిస్తున్నది. వీటితోపాటు డౌన్పేమెంట్ తగ్గించిన సంస్థ.. ప్రత్యేక ఫైనాన్స్ స్కీంలను కూడా ప్రవేశపెట్టింది.