హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్స్.. దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్తోపాటు ఫ్యాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్పై రూ.3 వేల వరకు ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్తోపాటు రూ. 2,999 డౌన్పేమెంట్తో బైకును కొనుగోలు చేసుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.