న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో ఐదు రోజుల్లోనే షియోమి ఏకంగా 20 లక్షలు పైగా స్మార్ట్ఫోన్లను విక్రయించింది. రూ 20,000 పైబడిన ఫోన్ల ప్రీమియం సెగ్మెంట్ అమ్మకాల్లో పది రెట్లు అధికంగా వృద్ధి రేటు కనబరిచింది. కస్టమర్కు మెరుగైన ప్రోడక్ట్ అనుభూతి కలిగించేలా గొప్ప డిజైన్, వినూత్న టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఎంఐ ఇండియా ముఖ్య వాణిజ్యాధికారి రఘు రెడ్డి వెల్లడించారు.
షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ, ఎంఐ 11ఎక్స్ సిరీస్కు భారీ డిమాండ్ నెలకొందని, ఆపై రెడ్మి నోట్ 10ఎస్, రెడ్మి నోట్ 10 ప్రొ, రెడ్మి 9 సిరీస్కు మిడ్ వ్యాల్యూ సెగ్మెంట్లో కస్టమర్ల నుంచి ఆదరణ లభించిందని చెప్పారు. ప్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ చానెల్స్ ద్వారా ఈ ఏడాది కాంపోనెంట్ల కొరత ఎదురైన స్మార్ట్ఫోన్ సేల్స్ మెరుగ్గా ఉన్నాయని షియోమి తెలిపింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆన్లైన్ చానెల్స్ ద్వారా 53-55 శాతం అమ్మకాలు సాగుతాయని టెక్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.