న్యూఢిల్లీ, అక్టోబర్ 28: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎంఐ పే, ఎంఐ క్రెడిట్ యాప్స్లను ప్లే స్టోర్, కంపెనీకి చెందిన యాప్ స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తున్నది.
ప్రారంభించిన మూడేండ్ల తర్వాత బిల్ పేమెంట్లు, నగదు బదిలీ సేవలకు సంబంధించి యాప్ రెగ్యులేటరీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గుర్తింపు పొందిన ఎంఐ పే యాప్ ఇక అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. దీనిపై షియోమీ, ఎన్పీసీఐలు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, పన్ను ఎగవేతకు సంబంధించి భారత్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న షియోమీకి సంబంధించిన 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.