Elon Musk | ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ తన యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. యూజర్లు తమ యాప్ అప్ డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ పొందవచ్చు. ఈ మేరకు ఎక్స్ ఇంజినీర్.. సంస్థ ఖాతా ద్వారా ‘ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తున్నది. కనుక యూజర్లు తమ యాప్ అప్ డేట్ చేసి ఫీచర్ను ఉపయోగించుకోండి` అని సూచించారు.
అయితే ‘ఎక్స్’ ప్రీమియం యూజర్లకే వీడియో, ఆడియో కాల్స్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దీని వినియోగం కోసం ‘ఎక్స్’ ఖాతాదారులు తమ యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘ప్రైవసీ అండ్ సేఫ్టీ’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అటుపై డైరెక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఎంచుకుంటే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘మిమ్మల్ని అనుసరిస్తున్న వారు, మీరు అనుసరిస్తున్న వారు, వెరిఫైడ్ యూజర్లు’ అనే ఆప్షన్లలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు..