ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్బస్ బెలుగా.. దుబాయ్లోని మాక్టోం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయిలాండ్లోని పటాయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్తున్నది. అయితే మార్గమధ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
ఆదివారం రాత్రి ల్యాండైన ఈ కార్గో ప్లేన్.. తిరిగి సోమవారం రాత్రి 7.20 నిమిషాలకు వెళ్లిపోయిందని ఎయిర్పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇంధనం నింపుకున్నారని పేర్కొన్నాయి.