న్యూఢిల్లీ : ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలతో 2021-22లో భారత్ ఆర్ధిక వ్యవస్ధ 8.3 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దేశంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తికి ముందు ప్రస్తావించిన వృద్ధి రేటు అంచనా కంటే ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వృద్ధి రేటు అంచనాను తగ్గించింది.
కరోనా సెకండ్ వేవ్తో ఆర్ధిక వ్యవస్ధలో రికవరీ మందగించిందని, దీంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాను 8.3 శాతానికి కుదించామని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా రీజియన్) హాన్స్ టిమ్మర్ వెల్లడించారు. భారత్ను కొవిడ్-19 సెకండ్ వేవ్ వణికించి తీవ్ర ఆరోగ్య సంక్షోభానికి దారితీసినా 8.3 శాతం వృద్ధి రేటు కనబరచడం సానుకూలాంశమేనని ఆయన పేర్కొన్నారు.