World Bank on GDP | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ మంగళవారం అంచనా వేసింది. వచ్చే ఏడాది (2022-23)లో అది 8.7 శాతానికి దూసుకెళ్తుందని పేర్కొంది. ఇంతకుముందు 2022-23లో ఇండియా జీడీపీ 7.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటులో మంద గమనం నేపథ్యంలో భారత్ జీడీపీ అంచనా యధాతథంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మార్చి నెలాఖరుతో ముగిసే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 8.3 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021 జూన్ ఔట్లుక్లో ఎటువంటి తేడా లేదు. ప్రైవేట్ రంగంలోనూ, మౌలిక వసతుల రంగంలోనూ అధిక పెట్టుబడులు రావడంతోపాటు ప్రస్తుతం చేపట్టిన సంస్కరణలు ఫలితాలను ఇస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2021-22లో భారత్ వృద్ధిరేటు 9.2 శాతం పెరుగుతుందని ఇటీవల ఎన్ఎస్వో పేర్కొన్న సంగతి తెలిసిందే.