న్యూఢిల్లీ: మానవాళిని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతున్నా బిలియనీర్ల క్లబ్ పలు రెట్లు పెరుగుతున్నది. ఈ క్లబ్లో సగటున ప్రతి 17 గంటలకో బిలియనీర్ జత కలుస్తున్నారు. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్-2021 జాబితా ఈ సంగతిని వెల్లడిస్తున్నది.
తాజా బిలియనీర్ల జాబితాలో కొత్తగా 493 మంది జత కలిశారంటే కుబేరుల రికార్డులు ఎలా పెరుగుతున్నాయో అర్థం అవుతున్నది. ఇంతకుముందు 2015లో అత్యధికంగా 290 మంది కుబేరులు అవతరించారు. ఆ తర్వాత 2021 కుబేరుల జాబితా సరికొత్త రికార్డుగా నిలిచింది.
నూతనంగా బిలియనీర్లుగా అవతారమెత్తిన వ్యాపారవేత్తల ఆస్తి సగటున 200 కోట్ల డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. గతేడాదితో పోలిస్తే టాప్-10 బిలియనీర్ల ఆస్తిలో మూడింట రెండొంతులు పెరిగింది.
2021 టాప్ 10 బిలియనీర్ల ఆస్తి మొత్తం విలువ 1.15 లక్షల కోట్ల డాలర్లు. గతేడాది నమోదైన 686 బిలియన్ల డాలర్లతో పోలిస్తే మూడింట రెండొంతులు ఎక్కువ.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి మొత్తం 177 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో వరుసగా నాలుగో ఏడాది అతిపెద్ద కుబేరుడిగా జెఫ్ బెజోస్ నిలిచారు.
తర్వాతీ స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్ మేజర్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, మూడో స్థానంలో ఫ్రాన్స్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్డ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నాలుగో స్థానంలో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంలో నిలిచారు.
భారతీయ బిలియనీర్.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గతేడాది నుంచి 10వ స్థానంలో కొనసాగుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన ఆస్తిలో కొత్తగా 84 బిలియన్ల డాలర్లు జత కూడాయి.
ఆసియా-పసిఫిక్ దేశాల్లో 1,149 మంది బిలియనీర్ల ఆస్తి 4.7 లక్షల కోట్లు. ఇక అగ్రరాజ్యం అమెరికా కుబేరుల ఆస్తే 4.4 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.
తాజాగా బిలియనీర్ల జాబితాలో అమెరికన్లు మొత్తం 724 మందితో మొదటి స్థానంలో ఉండగా, దానికి ప్రత్యర్థి చైనాలో 698 మంది బిలియనీర్లు తర్వాత స్థానం దక్కించుకున్నారు.
గతేడాది అమెరికాలో 614 మంది, చైనాలో 456 మంది బిలియనీర్లుగా అవతరించారు. కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో కొత్తగా 205 మంది కుబేరులు అవతరించడం ఆసక్తి కర పరిణామం.
తదనుగుణంగా చైనాలో కొత్తగా సంపన్నులుగా అవతరించిన వారిలో స్మూర్ ఇంటర్నేషనల్ సీఈవో కం చైర్మన్ చెన్ జిపింగ్ సంపద 15.9 బిలియన్ల డాలర్లు, ఆర్ఎల్ఎక్స్ టెక్నాలజీ సీఈవో కేట్ వాంగ్ ఆస్తి 5 బిలియన్ల డాలర్లుగా నిలిచింది.
అమెరికాలో కొత్తగా 98 మంది బిలియనీర్లు అవతరించారు. వారిలో కిమ్ కర్దాషియన్ వెస్ట్, హాలీవుడ్ మొగుల్ టైలర్ పెర్రీ ఆస్తి 100 కోట్ల డాలర్లు కాగా, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సంపద 1.3 బిలియన్ల డాలర్లుగా నమోదైంది.
మూడో స్థానంలో జర్మనీ కుబేరులు ఉన్నారు. 26 మంది జర్మనీ వ్యాపారులు కొత్తగా కుబేరులుగా రూపాంతరం చెందితే, తర్వాత స్థానాల్లో కెనడా, భారత్లలో 19 మంది జత కలిశారు. ఈ ఏడాది 36 దేశాల్లో కొత్తగా ఒకరు కుబేరులుగా అవతరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!