ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ఆగ్నేయాసియా ప్రాంతం టెలకాం హెడ్గా అంకుశ్ సైగల్ని నియమించింది. ఇంతకుముందు అసెంచుర్ కంపెనీలో ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడంలో కీలక పాత్రపోషించాడు. అంతేకాదు ఇన్ఫోసిస్లోనూ కొన్నాళ్లు పనిచేశాడు.
ఆగ్నేయాసియా ప్రాంతంలో టెలికాం రంగంలో విప్రో వ్యాపారం అభివృద్ధి చెందేందుకు అంకుశ్ కృషి చేస్తాడని, కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ పరిశ్రమని విస్తరిస్తాడని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అంకుశ్ బిజినెస్ కన్సల్టింగ్లో ఎక్స్పర్ట్. ఐటీ మార్కెట్, సేల్స్లో అనుభవం ఉంది.