Ratan Tata | టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ 2016లో టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2021 సుప్రీంకోర్టు ఆమోదించింది. దీన్ని సమీక్షించాలంటూ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన సమీక్షా పిటిషన్ను గురువారం తోసిపుచ్చింది. దీనిపై టాటా సన్స్ చైర్మన్ ఎమిరస్ రతన్టాటా స్పందించారు. సైరస్ మిస్త్రీ సమీక్షా పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడాన్ని స్వాగతించారు.
ఇంతకుముందు ఇచ్చిన తీర్పును ధృవీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కృతజ్ఞతతోపాటు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన న్యాయ వ్యవస్థలో నైతికత, వ్యవస్థకు ఉన్న విలువను బలపరుస్తున్నది అని రతన్టాటా పేర్కొన్నారు.అయితే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలో ఏర్పాటైన ధర్మాసనం.. సమీక్షా పిటిషన్ను తోసిపుచ్చినా.. 2021 మార్చిలో సైరస్ మిస్త్రీపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది.
2016 అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని చైర్మన్గా తొలగిస్తూ టాటా సన్స్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. టాటా సన్స్ నిర్ణయాన్ని సైరస్మిస్త్రీ.. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించింది. మిస్త్రీని చైర్మన్గా నియమించాలని టాటా సన్స్ను ఆదేశించింది. ఎన్సీఎల్ఏటీ నిర్ణయంపై టాటా సన్స్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గతేడాది సుప్రీంకోర్టు తుది తీర్పు చెబుతూ మిస్ట్రీని తమ చైర్మన్గా తొలగిస్తూ టాటా సన్స్ 2016 అక్టోబర్ 24న జారీ చేసిన ఆదేశాలను ఆమోదించింది.