న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే ఏండ్లలో అన్ని రంగాల్లో లేటెస్ట్ టెక్నాలజీ సమూల మార్పులను తీసుకురానుంది. ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ను అమెరికన్ స్టార్టప్ లాంఛ్ చేసింది. ఈ పరిణామాల నేపధ్యంలో ఏఐపై వెబ్ ఆవిష్కర్త టిమ్ బెర్నర్స్ లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 35 ఏండ్లలో ప్రజలు డాక్టర్ను విశ్వసించినట్టే ఏఐని నమ్ముతారని అన్నారు.
ఏఐ అసిస్టెంట్లు మన జీవితాల్లో అంతర్భాగం అవుతాయని బెర్నర్స్ లీ అంచనా వేశారు. మనం వెబ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతామనే దానిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు.డాక్టర్లు, న్యాయవాదులు, బ్యాంకర్ల వంటి నమ్మదగిన ప్రొఫెషనల్స్ తరహాలో ఏఐ సహాయకులు మనకు సేవలందించే ప్రపంచాన్ని బెర్నర్స్ లీ ఊహించారు. ఏఐ సహాయకులపై నమ్మకం పెంపొందాల్సిన ప్రాముఖ్యతను బెర్నర్స్ లీ నొక్కిచెప్పారు.
భవిష్యత్తులో వైద్య నిపుణులపై ఉంచిన నమ్మకానికి సమానంగా వ్యక్తులు తమ కోసం సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేయడానికి ఏఐపై ఆధారపడతారని ఆయన అంచనా వేశారు. కాగా, ఓపెన్ ఏఐ చాట్జీపీటీ వంటి వినూత్న ఏఐ టూల్స్ రాకతో కంపెనీలు వినియోగదారులతో డీల్ చేసేందుకు పలు టాస్క్ల కోసం డిజిటల్ చాట్బాట్స్ను ఎంచుకుంటున్నాయి. సమాచారం సేకరించడం నుంచి రాయడం, కోడింగ్ వంటి పనులకు ఆయా కంపెనీలు ఏఐ టూల్స్ వినియోగిస్తున్నాయి. శాంసంగ్, హ్యుమనే ఏఐ వంటి కంపెనీలు స్మార్ట్ఫోన్లు, వేరబుల్స్ వంటి ఏఐ ఆధారిత డివైజ్లను ఇప్పటికే ప్రారంభించాయి.
Read More :