Arvind Subramanian : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జీడీపీ గణాంకాలపై మాజీ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జీడీపీ గణాంకాలు అంతుచిక్కనివిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓ వార్త సంస్ధ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాజా జీడీపీ గణాంకాలు తనకు అర్ధం కాలేదని, ఇవి అంతుచిక్కని విధంగా ఉన్నాయని విస్మయం వ్యక్తం చేశారు. ఉదాహరణకు ప్రభుత్వం వెల్లడించిన ద్రవ్యోల్బణ గణాంకాలు 1-1.5 శాతం మధ్య ఉండగా వాస్తవ ద్రవ్యోల్బణం 3-5 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్ధిక వ్యవస్ధ 7.5 శాతం వృద్ధి చెందుతుంటే ప్రైవేట్ వినియోగం 3 శాతం వెనుకబడిఉందని గుర్తు చేశారు. తాజా జీడీపీ గణాంకాల ప్రకారం 2024 ఆర్ధిక సంవత్సరం మూడో క్వార్టర్లో భారత ఎకానమీ 8.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి, రెండవ క్వార్టర్లలో వృద్ధి రేటును 8.2, 8.1 శాతంగా సవరించారు.
గత రెండు, మూడు క్వార్టర్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా తగ్గాయని 2014 నుంచి 2018 వరకూ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా వ్యవహరించిన అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. భారత్ పెట్టుబడుకు అత్యంత ఆకర్షణీయ ప్రదేశమైతే, అధికంగా ఎఫ్డీఐ ఎందుకు రావడం లేదనే ప్రశ్న ముందుకొస్తోందని చెప్పారు. కార్పొరేట్ పెట్టుబడులు కూడా 2016 స్ధాయిల కంటే దిగువన ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Read More :
Traffic Alert | ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు