న్యూఢిల్లీ, ఆగస్టు 21: కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి పీఎఫ్ వాటాను, వారు పనిచేసిన కంపెనీలు చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను 2022 వరకు కేంద్రప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. అయితే ఈపీఎఫ్వోలో రిజిస్టర్ అయిన యూనిట్లలో ఉద్యోగులను తిరిగి నియమించుకోవాలన్నారు. గతేడాది నవంబర్లో కేంద్రం అత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద.. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారి పీఎఫ్ వాటాను చెల్లిస్తామని ప్రకటించింది. ఈ స్కీమ్లో 15 వేలలోపు జీతం ఉన్నవారికి పీఎఫ్ జమచేస్తున్నారు.