హైదరాబాద్, జూలై 25: ఎంఎస్ఎంఈలు పర్యావరణ రహిత, సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సేవలు అందించడానికి వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రాలపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్వస్థి ప్రోగామ్ డైరెక్టర్ జోసెఫ్ జులియన్ కేజీలు సంతకాలు చేశారు.
స్వస్థి, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయంగా ఉన్న చిన్న, సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమల ఉత్పత్తులు ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లో విక్రయించుకోవడానికి వీలుపడనున్నదని జయేశ్ రంజన్ తెలిపారు. అలాగే చిన్న స్థాయి వ్యాపార వేత్తల్లో నైపుణ్యం మెరుగుపరచడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు, దీంతో వారు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి దోహదం చేయనున్నదన్నారు. ఇప్పటికే స్వస్థి ప్రోగ్రాం కింద 32 వేల ఎంఎస్ఎంఈలు శిక్షణ పొందివున్నారని జోసెఫ్ తెలిపారు.