న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి వాటా రానున్నది. సంస్థ షేర్ ధర రూ.10, ఆపైన స్థిరీకరణ అయిన తర్వాతే వాటాను స్వీకరిస్తామని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
ఏజీఆర్ బాకీల్లో భాగంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దాదాపు రూ.16,000 కోట్ల వడ్డీ బకాయిని ఈక్విటీలోకి మార్చాలని వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి వొడాఫోన్ ఐడియా షేర్లు రూ.10 కంటే తక్కువ స్థాయిలోనే స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం కూడా బీఎస్ఈలో రూ.9.7 వద్ద షేర్ విలువ ముగిసింది.