Corporate Companies | న్యూఢిల్లీ, మార్చి 30: భారత్లో వివిధ ఉత్పత్తులు, సేవల ధరల్ని అమాంతం పెంచే శక్తి కలిగిన పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని, ఈ వాణిజ్య గ్రూప్లను బద్దలు చేయాల్సి ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త విరాల్ ఆచార్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్యాబిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, భారతి టెలికం-ఈ ‘బిగ్ 5’ స్థానిక చిన్న సంస్థల్ని దిగమింగి బడా గ్రూప్లుగా ఎదిగాయన్నారు. రిటైల్ వ్యాపారం, సహజ వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో ధరల్ని పెంచే శక్తి వీటికి వచ్చిందన్నారు.
2017-19 మధ్య రిజర్వ్బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన విరాల్ ఆచార్య ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వర్థమాన దేశాలపై బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ ప్యానల్కు సమర్పించిన ఒక పత్రంలో ఆచార్య భారత్లోని పరిస్థితులపై పలు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ‘బిగ్ 5’కు బాసటగా నిలుస్తున్నాయని, ప్రభుత్వం భారీగా పెంచివేసిన దిగుమతి సుంకాలతో విదేశీ పోటీ సంస్థల నుంచి దేశీ పెద్ద వాణిజ్య గ్రూప్లు రక్షణ పొందుతున్నాయన్నారు. ‘జాతీయ వాణిజ్య చాంపియన్లను తయారు చేయడం ‘నవ భారత్’ పారిశ్రామిక విధానమని చెపుతున్నారు. కానీ ఈ విధానం పరోక్షంగా ధరలు అధికస్థాయిలో కొనసాగేలా చేస్తున్నది’ అని ఆచార్య వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…