న్యూఢిల్లీ, ఆగస్టు 31: పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.566 కోట్లకుపైగా నిధులను సమీకరించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది. విజయ డయాగ్నోస్టిక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) సెప్టెంబర్ 1-3 మధ్య పబ్లిక్ సబ్స్క్రిప్షన్కు వస్తున్న విషయం తెలిసిందే. షేర్ ధరల శ్రేణి రూ.522-531గా ఉన్నది. ఈ క్రమంలో 29 యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.531 చొప్పున 1,06,61,41 ఈక్విటీ షేర్లను కేటాయించి రూ.566.12 కోట్ల నిధులను పొందింది.