న్యూఢిల్లీ, మే 1: గత నెలలో వాహన అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు దేశీయంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణం.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ అమ్మకాలు 13 శాతం పెరిగాయి. చిప్ల కొరతతో ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేసుకోవడం విశేషమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో 3.31 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.