న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18.50 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1 ముఖవిలువగల ఈక్విటీ షేరుపై 1850 శాతం డివిడెండుగా చెల్లించేందుకు బోర్డు ఆమోదించిందని, డివిడెండు రూపంలో రూ.6,877 కోట్లు షేర్హోల్డర్లకు చెల్లించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. డివిడెండు చెల్లింపునకు సెప్టెంబర్ 9 రికార్డుతేదీగా నిర్ణయించారు.