UPI international | మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడానికి రూపొందించిందే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ -యూపీఐ).. యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పర్యవేక్షిస్తుంది. ఇది ఇప్పటి వరకు దేశీయంగా మాత్రమే వినియోగంలో ఉంది. క్రమంగా విదేశాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు ప్రత్యేకించి మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్ – యూపీఐ పేమెంట్స్ కోసం ఆమోదం లభిస్తున్నది. ఇప్పటికే ఏడు దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నది. దీంతో భీమ్తోపాటు జీ-పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ `క్యూఆర్ కోడ్` స్కాన్ చేయడంతో ఆన్ లైన్ లో ఫోన్ చెల్లింపులు చేయొచ్చు. యాప్ ఆధారిత పేమెంట్స్ను విదేశాల్లో అనుమతించడం వల్ల ఆయా దేశాల కరెన్సీలోనే చెల్లింపులు జరుగుతాయి. ప్రత్యేకించి విదేశాలకు వెళ్లే వారు వెంట డాలర్లు, కరెన్సీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
శ్రీలంకలో మీరు పర్యటిస్తున్నప్పుడు మర్చంట్ల వద్ద ‘క్యూఆర్ కోడ్’ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
భారతీయులు మారిషస్ కు వెళ్లినా, భారత్ కు మారిషస్ వాసులు వచ్చినా ఇన్ స్టంట్ పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
తొలిసారి విదేశాల్లో యూపీఐ సేవలు అనుమతించింది భూటాన్ లోనే. 2021 జూలై 13న భూటాన్ లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం భీం యాప్, భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఫ్రాన్స్ లైరా నెట్ వర్క్ తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల రెండో తేదీన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
2022 ఏప్రిల్ 21న యూపీఐ సేవలు ప్రారంభం అయ్యాయి. మాషెర్ క్యూ బ్యాంక్ అనుబంధ నియో పే సంస్థకు చెందిన నియో పే టర్మినల్స్ నుంచి పేమెంట్స్ టు మర్చంట్స్ కు చెల్లింపులు చేయొచ్చు.
సింగపూర్ పే నౌ ఎస్ జీ సంస్థతో యూపీఐ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. సింగపూరియన్ పే నౌ యూజర్కు భారతీయ యూపీఐ యూజర్ చెల్లింపులు చేయొచ్చు. ఈ నెలాఖరులో నేపాల్ ప్రభుత్వంతో కేంద్రం యూపీఐ చెల్లింపులకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.