హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కట్టడిలో హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ (ఐఐఎల్) కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. ఐఐఎల్ను సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే 20 లక్షల డోసులకు సరిపడా ముడిసరుకును అందజేసినట్టు చెప్పారు. వీటితో భారత్ బయోటెక్ ఇప్పటికే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. ఐఐఎల్ సామర్థ్యం వచ్చే నెలలో సామర్థ్యం 30 లక్షల డోసులకు పెరుగుతుందని, ఏడాది చివరినాటికి నెలకు ఒక కోటి డోసులకు చేరుకుంటుందని వెల్లడించారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పెద్ద సంస్థలు చేతులు కలుపడం శుభ సూచకమని, దేశీయ కంపెనీలు ఒకరికొకరు సహకరించుకోకుంటే అంతర్జాతీయ సంస్థలు వాటిని సొంతం చేసుకొనే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.