న్యూఢిల్లీ, జూలై 24:ప్రభుత్వరంగ సంస్థలైన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు బాస్లు లేకుండా పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాంక్లకు చైర్మన్లను నియమించలేదు నరేంద్ర మోదీ సర్కార్. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లకు కూడా చైర్మన్లు లేరు.
ఈ విషయాన్ని లోక్సభకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ తెలియచేశారు. వీటిలో ఇండియన్ బ్యాంక్ చైర్మన్గా ఆగస్టు 2018 నుంచి, ఆగస్టు 2020 నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, ఫిబ్రవరి 2020 నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, మే 2021 నుంచి సెంట్రల్ బ్యాంస్లకు బాస్లు లేరు.