న్యూఢిల్లీ, నవంబర్ 9: కొద్ది నెలలుగా భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాల్లో కోతపెడుతున్న అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తరహాలోనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ సైతం తాజాగా తగ్గించింది. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.5 శాతానికి పడిపోతుందని, 2022-23లో 6.9 శాతానికి పరిమితమవుతుందంటూ అంచనాల్ని వెల్లడించింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, ద్రవ్య విధానాలు కఠినతరం చేయడం ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నది. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్కు అంతర్జాతీయ పరిణామాల నుంచి రక్షణ ఉండబోదని యూబీఎస్ ఎకానమిస్టులు వ్యాఖ్యానించారు.
అంచనాల వివరాలు…