Gold | మహారాష్ట్రలోని అకొలా రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కిలోల బంగారం, 100 కిలోల వెండిని అధికారులు జప్తు చేశారు. ముంబై-హౌరా మెయిల్ రైలులో వచ్చిన ప్రయాణికుడి నుంచి శుక్రవారం బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసు ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు.
ముంబై-హౌరా మెయిల్ దిగిన సదరు ప్రయాణికుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. భారీ బరువుతో కూడిన బ్యాగ్తో వెళుతున్న ఆ ప్రయాణికుడిని బ్యాగ్ తెరవాలని ఆర్పీఎఫ్ అధికారులు కోరారు. అందుకు తిరస్కరించడంతో ఆయన్ను ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.
తాను ఒక కొరియర్ సంస్థలో పని చేస్తున్నట్లు సదరు ప్రయాణికుడు తమ విచారణలో చెప్పాడని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అతడి వద్ద బ్యాగ్లో 100 కిలోల వెండి బిస్కట్లు, రెండు కిలోల బంగారం బార్లు ఉన్నాయని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.