TVS | చెన్నై కేంద్రంగా పని చేస్తున్న ఆటోమొబైల్ కంపెనీ ‘టీవీఎస్ మోటార్ కంపెనీ’ నూతన శ్రేణి టూ వీలర్స్, త్రీ వీలర్స్ ఆవిష్కరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ న్యూ వర్షన్లను ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో ‘ఐక్యూబ్’, ‘ఐక్యూబ్ ఎస్’, ‘ఐక్యూబ్ ఎస్టీ’ మార్కెట్లో లభిస్తున్నాయి.
కొత్తగా ఆవిష్కరించే ఐక్యూబ్ న్యూ వర్షన్ స్కూటర్లలో వేర్వేరు బ్యాటరీ కెపాసిటీ, వేర్వేరు ధరల ఆప్షన్లలో ఉంటాయి. వాటి ఆవిష్కరణకు టీవీఎస్ మోటార్ కంపెనీ ఎటువంటి టైంలైన్ ప్రకటించలేదు. కొత్తగా ప్రదర్శించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ (ఈ3డబ్ల్యూ).. డెవలప్ మెంట్ అడ్వాన్స్ దశలో ఉందని తెలిపింది.
ఈ ఏడాది భారత్ మార్కెట్ తోపాటు పలు దేశాల్లో ఆవిష్కరిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1100-1200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రూపొందించింది. కొత్త ఉత్పత్తుల కోసం సుమారు రూ.1000 కోట్ల నిధులు కేటాయించింది. గతేడాది టీవీఎస్ మోటార్ ‘ఎక్స్’ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. త్వరలో వాటి డెలివరీ ప్రారంభం కానున్నది.