న్యూఢిల్లీ, నవంబర్ 28: ట్రావెల్ టెక్నాలజీ సేవల సంస్థ ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.63 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్న సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం ఎగబాకి రూ.2,905 కోట్లు ఆర్జించింది.