TRAI on Digital Payments | డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉచితంగా అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్డీ) సందేశాలను అందించాలని టెలికం ప్రొవైడర్లకు ప్రతిపాదించింది. ఫీచర్ ఫోన్లతో పాటు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు వాడే యూఎస్ఎస్డీ సందేశాలను పూర్తి ఉచితంగా అందించాలని కోరింది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు వీటిపై 50 పైసల నుంచి రూ.1.50 వసూలు చేస్తున్నారు.
ఈనెల 24న జరిగిన టెలికాం టాక్లో ట్రాయ్ ఈ ప్రతిపాదన తెచ్చింది. మెసేజ్లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా తెలిపేందుకు ఉపయోగించే ప్రోటోకాల్..అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థల యూఎస్ఎస్డీ నంబర్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి.