న్యూఢిల్లీ, జూలై 21: పెస్కీ కాల్, ఎస్ఎంఎస్ నిబంధనల్ని ఉల్లంఘించిన టెలికం సంస్థలపై టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్ జరిమానా వేసింది. అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లతో మొబైల్ వినియోగదారులు విసిగిపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలంటూ టెలికం కంపెనీలకు ట్రాయ్ స్పష్టం చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆయా సంస్థలపై ట్రాయ్ రూ.34.99 కోట్ల ఫైన్ వేసినట్టు శుక్రవారం రాజ్యసభకు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.