ముంబై, జనవరి 26: విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టార్క్ మోటర్స్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి రెండు మోటర్సైకిళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రూ.1.08 లక్షల ధర కలిగిన క్రాటోస్ ఒకటికాగా, రూ.1.23 లక్షల విలువైన క్రాటోస్-ఆర్ మోడళ్ళు ఉన్నాయి. ఈ ధరలు పుణె షోరూంనకు సంబంధించినవి. ఈ బైకులు రూ.999 ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కేవలం 3.5 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ బైకులు గరిష్ఠంగా 105 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఇంట్లో ఉండే చార్జింగ్ ప్లగ్తోనే ఈ బైకునకు సంబంధించిన బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చును. ప్రస్తుతానికి ఈ బైకులు పుణెలో మాత్రమే లభించనున్నాయని, త్వరలో హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలలో దశలవారీగా విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు
వెల్లడించాయి.