CNG Cars | న్యూఢిల్లీ, ఆగస్టు 8: పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన పలు కార్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటంతో కస్టమర్లు ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సీఎన్జీ, ఎల్పీజీవీ వాహనాలు ఉన్నాయి. వీటిలో ఈవీలు అత్యధిక ధర ఉండటంతో వీటిపై కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో తక్కువ ధర కలిగిన సీఎన్జీ మాడళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా ఇవ్వడం ఇందుకు కారణం. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీతోపాటు టాటాలు పలు మాడళ్లను విడుదల చేసి కస్టమర్ల మన్నలను పొందాయి. బీఎస్6 నిబంధనలు మరింత కఠినతరమవుతుండటం కూడా సీఎన్జీ వాహనాలకు గిరాకీ పెరగడానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న తొలి 4 సీఎన్జీ కార్లపై లుక్కెద్దాం….
టాటా పంచ్ కూడా సీఎన్జీ కూడా అందుబాటులోకి వచ్చింది. సన్రూఫ్ కలిగిన ఈ మాడల్ను సంస్థ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో రూపొందించింది. ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ మాడల్ 27 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
టాటా టియాగోలో సీఎన్జీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ కలిగిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.6.55 లక్షలుగా నిర్ణయించింది. 27 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్న ఈ కారు దేశీయ రోడ్లపై దూసుకుపోతున్నాయి.
తన చిన్న కారైన ఆల్టో 800ని సీఎన్జీలోనూ ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.5.13 లక్షలు మాత్రమే. ఏఆర్ఏఐ ప్రకారం ఈ కారు 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలేరియాలో సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ. రూ.6.73 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ కారు 34.47 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. అలాగే పెట్రోల్ మాడల్ 26.68 కిలోమీటర్లు మైలేజీ.