Two Wheelers Sales | గతనెలలో దేశవ్యాప్తంగా టూ వీలర్స్ సేల్స్ లో 17.40 శాతం పురోగతి నమోదైంది. గతేడాది మే నెలలో 12.53 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోగా, ఈ ఏడాది 14.71 లక్షల బైక్లు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. మొత్తం సేల్స్లో హీరో మోటో కార్ప్ మొదటి స్థానాన్ని కాపాడుకున్నది. గత నెలలో 5,08,309 టూ వీలర్స్ విక్రయించిన హీరో మోటో కార్ప్ 8.90 శాతం వృద్ధి రికార్డు చేసింది. హీరో స్ప్లెండర్ బైక్ అత్యధికంగా అమ్ముడైంది. తర్వాతీ స్థానాల్లో హోండా, టీవీఎస్ మోటార్స్ నిలిచాయి.
రెండో స్థానంలో ఉన్న హోండా మోటార్ బైక్స్ అండ్ స్కూటర్స్ గతేడాదితో పోలిస్తే మూడు శాతం సేల్స్ తగ్గాయి. గత నెలలో 3,20,857 వాహనాలు విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ గత నెలలో 2,53,690 మోటారు సైకిళ్లు, స్కూటర్లు విక్రయించింది. గతేడాది 1,91,482 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. జూపిటర్, ఎన్ టార్క్, అపాచీ, టీవీఎస్ ఎక్సెల్ సిరీస్ వంటి మోడల్ బైక్స్ ఎక్కువగా అమ్ముడు పోయాయి.
మరో ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో గతేడాది మే నెలలో 96,102 యూనిట్లు విక్రయిస్తే.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,94,684 యూనిట్లు విక్రయించింది. గ్లోబల్ మార్కెట్లోనూ బజాజ్ పల్సర్, ప్లాటినా వంటి బైక్స్ పాపులర్ బైక్స్గా నిలిచాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ గతేడాది మే నెలలో 53,525 బైక్స్ విక్రయిస్తే, ఈ ఏడాది 70,795 యూనిట్లు అమ్మింది. ఈ బ్రాండ్లో క్లాసిక్350 బైక్ అత్యధికంగా అమ్ముడైన బైక్గా ఉంది. భారత్ మార్కెట్లోకి ఎంటరైన రాయల్ ఎన్ ఫీల్డ్ మీటర్, హంటర్ బైక్స్ సేల్స్.. సుజుకి మోటార్స్ ను అధిగమించాయి.