Mobiles | న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. 4జీ, 5జీ సేవలతో అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లకు గిరాకీ బాగా పెరిగిపోయింది. బడ్జెట్ ధరల నుంచి ప్రీమియం రేట్ల వరకు లభిస్తున్న ఈ మొబైల్స్.. రకరకాల ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే సరసమైన ధరలకు అన్ని హంగులతో కూడిన మొబైల్స్ ఏమేమీ ఉన్నాయా? అన్న అన్వేషణను మొబైల్ ప్రేమికులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలాంటివారి కోసమే ఈ సమాచారం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ.30,000లోపు ధరల్లో టాప్-10 మోడల్స్లో కొన్నింటి వివరాలివి. ఇంచుమించుగా 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కెమెరా, స్క్రీన్, ర్యామ్, స్టోరేజీలపరంగా అత్యుత్తమ మొబైల్స్ ఇలా ఉన్నాయి.