న్యూఢిల్లీ, జనవరి 10: యూఎస్, యూరప్ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్లో డిసెంబర్ నెలలో అధికశాతం ఉద్యోగులు సెలవుల్లో వెళతారు. దీంతో సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 బలహీనమైన త్రైమాసికంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దిగ్గజ కంపెనీల ఆదాయ, లాభాల్లో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంటుందని బ్రోకరేజ్లు భావిస్తున్నాయి. 2023 డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికానికి టీసీఎస్, ఇన్ఫోసిస్లు గురువారం జనవరి 11న ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో 9 బ్రోకరేజ్ సంస్థల సగటు అంచనాలు ఇలా ఉన్నాయి..
టీసీఎస్
ఇన్ఫోసిస్