ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి నష్ఠాల నేపథ్యంలో ఇవాళ ఇన్వెస్టర్లు కనిష్ఠాలవద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.