ముంబై: ప్రపంచ దేశాల్లో కరోనా తోపాటు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. భారత్ లోనూ కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
అంతేకాదు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ సెన్సెక్స్ 281పాయింట్ల నష్టంతో 56,844 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి16,922 వద్ద ట్రేడవుతున్నది.